జలుమూరు: దివ్యాంగ విద్యార్థుల గుర్తింపు సర్వే నిర్వహణ

77చూసినవారు
జలుమూరు: దివ్యాంగ విద్యార్థుల గుర్తింపు సర్వే నిర్వహణ
సమగ్ర శిక్ష రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ విద్యార్థులను గుర్తించడం జరుగుతుందని ఐ ఈ ఆర్ పి కృష్ణ ప్రసాద్, రమేష్ తెలిపారు. మంగళవారం జలుమూరు మండలం లో పలు అంగన్వాడి కేంద్రాలలో దివ్యాంగుల గుర్తింపు సర్వే సందర్భంగా పర్యటించామని వివరించారు. ఈ సర్వేలో భాగంగా పదిమంది దివ్యాంగ విద్యార్థులను గుర్తించమన్నారు. ఈ సర్వే జూన్ 9 వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్