జలుమూరు: శ్రీముఖలింగంలో మహా శాంతి రుద్రయాగం నిర్వహణ

64చూసినవారు
జలుమూరు మండలం శ్రీముఖలింగం లో ఉన్న శ్రీముఖలింగేశ్వర ఆలయంలో పాకిస్తాన్ పై విరోచితంగా పోరాడుతున్న భారత జవానులకు అభినందనలు తెలియజేస్తూ మహా శాంతి రుద్ర యాగం నిర్వహించామని సర్పంచ్ తమన్న గారి సతీష్ తెలిపారు. శనివారం ఉదయం స్థానిక వేద పండితులు ఆధ్వర్యంలో రుద్రయాగం చేపట్టామన్నారు. భారత జవాన్లు మరింత శక్తి పుంజుకునేందుకు తమ వంతుగా ఈ యాగాన్ని నిర్వహించేమన్నారు. కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్