ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగించుకోకపోవడం వలన చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపటం వలన ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని నరసన్నపేట బార్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో హెల్మెట్ వాడకం వలన కలిగే ప్రయోజనాలను వాహనదారులకు వివరించి, ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు.