నరసన్నపేట మండలం కంబకాయ గ్రామంలో పిచ్చికుక్క దాడికి పాల్పడడంతో ఆరుగురికి గాయాలయ్యాయి. గురువారం ఉదయం గ్రామంలో స్థానిక గ్రామస్తులు తిరుగులాడే సమయంలో పిచ్చికుక్క ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దాడిలో వరుసగా దానికి ఎదురైన వారందరికీ కుక్క కాట్లు వేసి పరార్ అయింది. స్థానికలు వెంటనే స్పందించి గాయపడిన వారిని నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిచ్చికుక్క పట్ల చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు కోరుతున్నారు.