నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్న భవిత కేంద్రాన్ని ఎంఈఓ దాలినాయుడు ఆకస్మికంగా పరిశీలించారు. గురువారం కేంద్రానికి వెళ్లిన ఆయన స్థానిక కేంద్రంలో ఉన్న దివ్యంగులకు అందుతున్న భోజన, మౌలిక వసతుల కొరకు అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులకు విద్య పట్ల శ్రద్ధ కలిగేలా చూడాలని స్థానిక ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో భవిత ఉపాధ్యాయులు శ్రీనివాస్, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.