నరసన్నపేట మండలం బుచ్చిపేట వంశధార నది తీరంలో కొలువైన అభయ ఆంజనేయస్వామి ఆలయ మూడో వార్షికోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలోనే 175 అడుగుల ఎత్తులో నిర్మించిన ఆంజనేయస్వామి విగ్రహం ఎంతో పేరుగాంచిందని పేర్కొన్నారు.