నరసన్నపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ముగిసిన బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరిగా స్వామి వారి చక్ర తీర్థ స్నానాలు చేపట్టారు. శనివారం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి సాయి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు అనంతరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.