నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక జాతీయ రహదారిలో ఇటీవల లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇరువురి మృతి ఘటనలో కేసు నమోదు చేయడం జరిగిందని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు కేసును పూర్వాపరాలను గుర్తించి లారీ డ్రైవర్ వీరభద్రయ్య, క్లీనర్ దాసరి విజయ్ కుమార్ పై కేసు నమోదు చేసామన్నారు. గురువారం వచ్చిన నివేదిక అనుసరించి వారిద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచి రిమాండ్ కు తరలించామని పేర్కొన్నారు.