అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి నరసన్నపేటలో నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం రాత్రి టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన ఆధ్వర్యంలో ఈ కార్య క్రమాన్ని నిర్వహించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని తెలిపారు.