నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం రాత్రి స్వామివారిని సరస్వతి మాతగా అలంకరించి హంస వాహనంపై తిరువీధి చేపట్టారు. ఈ క్రమంలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో శ్రీనివాసుని కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు.