రాష్ట్ర సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించేందుకు సర్వే నిర్వహిస్తున్నామని ఐ ఈ ఆర్ పి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం నరసన్నపేట మండలం మడపాం పంచాయితీలో ఉన్న అంగన్వాడి కేంద్రాలను సందర్శించామని ఆయన వివరించారు. ఆయన మాట్లాడుతూ మే 13 నుంచి జూన్ 9 వరకు సర్వే కొనసాగనున్నట్లు తెలిపారు. సర్వేలో నమోదు కాని కానీ వారు ఉంటే వారి పేర్ల నమోదు చేసుకోవాలన్నారు.