నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం మాజీ సర్పంచ్ ప్రతినిధి లుకలాపు రాంబాబు అనారోగ్యంతో మృతి చెందారు. శనివారం విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల కాలంలో స్వల్ప అనారోగ్యంతో బాధపడ్తున్నారు. టిడిపి రైతు సేవా సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయన మృతి పట్ల ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సంతాపం వ్యక్తం చేశారు.