నరసన్నపేట నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న గ్రిక్స్ పోటీలను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రారంభించారు. శుక్రవారం పోలాకి మండలం మబగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు మానసిక ఉల్లాసం పొందేందుకుగాను నిర్వహిస్తున్న ఈ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.