జనాభా పెరుగుదలతో సమాజ అభివృద్ధి జరిగేందుకు విఘాతం ఏర్పడుతుందని వైద్యాధికారులు సుజాత, అరవింద్ తెలిపారు. నరసన్నపేట మండలం ఉర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా గురువారం ర్యాలీ నిర్వహించారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జనాభా పెరుగుదలతో కుటుంబాలు కూడా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని తెలియజేశారు. జనాభా నియంత్రణ పట్ల ప్రతి కుటుంబం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.