పోలాకి మండలంలో పలు గ్రామాలలో ఆర్ అండ్ బి రహదారులకు సంబంధించిన మరమ్మత్తు పనులను వేగవంతం చేస్తున్నామని ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం మండలంలోని జడూరు నుండి గాతల వలస వరకు సుమారు 3. 8 కిలోమీటర్ల మేర రహదారిలో మరమత్తు పనులు చేపట్టడం జరిగిందని వివరించారు. ఇందుకు గాను పది లక్షల రూపాయలు నిధులను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని వివరించారు. రేపటితో పనులు ఈ రహదారిలో పూర్తి అవుతాయని ఆయన పేర్కొన్నారు.