విశాఖపట్నం కృష్ణా కాలేజ్ గ్రౌండ్లో వాకింగ్ చేస్తూ పాలకొండకు చెందిన ఈట్ల రమేష్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఈయన స్వస్థలం పాలకొండలోని పాత గ్యాస్ ఆఫీస్ వద్ద నివాసం అని స్థానికులు తెలిపారు. విశాఖపట్నంలో ఈయన మెడికల్ రిప్రజెంటేటివ్గా పని చేస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన విశాఖపట్నం వెళ్లారు. ఒక్కసారిగా పాలకొండ పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.