జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నగర పంచాయతీ పరిధిలోని వెంకంపేట ఎం.పి.యుపి పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. పరాంకుశం నాయుడు ఫూలే జీవిత విశేషాలను విద్యార్థులకు తెలియజేశారు. ఆమె సేవలను కొనియాడారు.