శ్రీకాకుళం నగరానికి చెందిన పాలకొండ ప్రశాంత్ ఇప్పటివరకు 30 సార్లు రక్తదానం చేశారు. ఐదేళ్లుగా ప్రతీ ఏడాది మూడు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ యువతలో అవగాహన పెంచుతున్నారు. సిక్కోలు సోషల్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడిగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఈ తరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.