మందస: అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

53చూసినవారు
మందస: అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమాత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ పలాస ఎస్. హెచ్. ఓ సోమేశ్వరరావు అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో గురువారం మందస మండలం కుంటికోట నారాయణ హై స్కూల్ ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిమాపక సిబ్బంది వివిధ రకాల అగ్నిప్రమాదాలు, వంటగదిలో గ్యాస్ సిలిండర్ లీకేజీ, బట్టలు అంటుకోవడం, మంటల్లో చిక్కుకోవడం సందర్భాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.

సంబంధిత పోస్ట్