జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో, శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి విశాఖపట్నం సహకారంతో పలాస సత్యసాయి మందిరంలో గురువారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో శంకర్ ఫౌండేషన్ ఆప్తమాలజీ నిపుణుల బృందం సురేష్, యశస్విని, ఉష మరియు నేత్ర వైద్యాధికారి ఆర్ వెంకటరమణ, క్యాంప్ మేనేజర్ సురేష్ ల ఆధ్వర్యంలో 104 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 62 మందికి కంటి శుక్లముల ఆపరేషన్ నిమిత్తం రిఫర్ చేశారు.
Where: పలాస