రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష కొనియాడారు. గురువారం వజ్రపు కొత్తూరు మండల కేంద్రంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ కలెక్షన్స్ సెంటర్ ( ఎఫ్ పి ఓ )ను ప్రారంభించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని రైతులు సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. ప్రభుత్వం అన్ని వర్గాలకు ముఖ్యంగా రైతులను ఆదుకోవడంలో ముందుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.