పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన దాడుల పట్ల విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గురువారం సాయంత్రం పలాస మండల కేంద్రంలో మాజీ సైనికులు జై భారత్ నినాదంతో భారత జవాన్లకు అభినందనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొని సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ విజయం భారత్ ఎన్నడు మరచిపోలేనిదని పేర్కొన్నారు.