ప్రజా ఫిర్యాదులు పెండింగ్ ఉండరాదని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి సూచించారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల నుండి పలు ఫిర్యాదులు స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదులు పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.