పలాస: మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

58చూసినవారు
మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష కొనియాడారు. పలాస మండలం రామకృష్ణాపురం సమీపాన గల ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీలో శనివారం రూ. 3 కోట్ల 16 లక్షల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా మంజూరైన ఇంటింటికి మంచి నీళ్ల కులాయి పథకాన్ని ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కొనియాడారు.

సంబంధిత పోస్ట్