రణస్థలం మండలం నడుకుదిటిపాలెంలో శుక్రవారం మినీ గోకులం షెడ్ ను ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పశువుల సంక్షేమాన్ని మెరుగుపరచడం, రైతుల జీవనోపాధిని అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. అనంతరం మినీ గోకులం షెడ్ ప్రారంభించి నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.