గత 12 సంవత్సరాల నుండి సహారా ఖాతాదారుల డిపాజిట్లు సొమ్ము ఉన్న సహారా బాధితులకు తక్షణమే డిపాజిట్లు చెల్లించాలని కోరుతూ పలాస సహారా కార్యాలయం వద్ద బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. సహారా కస్టమర్స్ అండ్ ఫీల్డ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మాట్లాడుతూ శ్రీకాకుళం రీజన్ పరిధిలో సుమారు రూ. 500 కోట్ల రూపాయలు సహారా సంస్థ ఖాతాదారులకు ఇవ్వాల్సి ఉందన్నారు. వెంటనే ఖాతాదారుల సొమ్ము చెల్లించాలని కోరారు.