మందస మండలానికి పంచాయతీ సెక్రటరీల కొరత వేధిస్తుంది. 41 పంచాయతీలు గల పెద్ద మండలానికి కేవలం 27 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే సుమారు రెండు పంచాయతీలకు ఒక్కరే కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు గ్రామాలలో పర్యవేక్షణ కొరవడడంతో అభివృద్ధి కుంటుపడుతున్న పరిస్థితులు నెలకొంటున్నట్లు పలువురు వాపోతున్నారు.