డెంగ్యూ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం డీఎంహెస్ఓ కార్యా లయం నుంచి ఏడు రోడ్ల జంక్షన్ వరకు జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2021 నుంచి డెంగ్యూ కేసులు తగ్గుముఖం పట్టాయి అన్నారు. ఆకస్మాత్తుగా కండరాలు, కీళ్ల నొప్పులు లక్షణాలు కనిపిస్తే వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.