సోంపేట మండలం బట్టిగుళ్ళూరు గ్రామ దేవత సంబరాలు 50 సంవత్సరాల తర్వాత ఈ నెల 11 నుంచి 15 వరకు జరగనున్నాయి. శ్రీ పెద్ద అమ్మవారు, శ్రీ మంకినమ్మ తల్లి గ్రామ దేవత ఉత్సవాలకు గ్రామ పెద్దలు సహకారంతో కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. అందరిని ఆకట్టుకునేలా గ్రామంలో పలుచోట్ల పెద్దపెద్ద బెలూన్లు ఎగరవేసేందుకు సిద్ధం చేశారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న బంధువులు, విద్యార్థులు, స్నేహితులు గ్రామానికి చేరుకోవడంతో పండగ వాతావరణం ప్రారంభమైంది. ఇప్పటికే సినీ నటులు వెంకటేష్, సుమన్, కేజీఎఫ్ సినిమా విలన్ గరుడను కమిటీ ఆహ్వానం పలికిన విషయం తెలిసిందే.