గత వైకాపా ప్రభుత్వం పెట్టిన కేసులకు మంగళవారం కోర్టు వాయిదా సందర్బంగా కొత్తూరు న్యాయ స్థానానికి శ్రీకాకుళం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తి హాజరయ్యారు. ఈయనతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్, కలమట అనుచరులు పెద్దిన అమర్ నాధ్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.