జలుమూరు: భారత్ విజయం సాధించాలని మహా శాంతి రుద్రయాగం

71చూసినవారు
జలుమూరు: భారత్ విజయం సాధించాలని మహా శాంతి రుద్రయాగం
టెర్రరిస్టులను అంతం చేసేందుకు ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ తో పోరాడి మన దేశ గౌరవాన్ని కీర్తి ప్రతిష్టలను పెంచే విధంగా వారికి శక్తిని ప్రసాదించాలని జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలోని శ్రీముఖలింగేశ్వర ఆలయంలో మహా శాంతి రుద్ర యాగం శనివారం నిర్వహించారు. మన దేశం కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న జవాన్లకు శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. గ్రామ ప్రజలు, భక్తులు పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్