కొత్తూరు మండల కేంద్రం అయినటువంటి నివగాం లో ఎమ్మెల్యే గోవిందరావు ఆదేశానుసారం నివగాం టూ హడ్డుబంగి ప్రధాన రహదారి రోడ్డు పనిని మంగళవారం ప్రారంభించారు. గ్రామస్తుల కథనం ప్రకారం ఈ రోడ్డులో నీరు నిలిచిపోయి ఎన్నో ప్రమాదాలు జరిగేవని ఎంతోమంది ద్విచక్ర వాహనదారులు అక్కడ పడి గాయాల పాలయ్యేవారని గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఈ రోడ్డును పట్టించుకున్న నాదులే లేరని గ్రామస్తులు పేర్కొన్నారు.