కొత్తూరు: వనప గ్రామంలో పాముకాటుతో ఒకరు మృతి

57చూసినవారు
కొత్తూరు: వనప గ్రామంలో పాముకాటుతో ఒకరు మృతి
కొత్తూరు మండలం వసప గ్రామానికి చెందిన కొయిలాపు పాపయ్య కుమారుడు తేజేశ్వరరావుకి (35) గురువారం పాము కరచింది. గ్రామస్తులు, కుటుంబీకుల వివరాల ప్రకారం. మృతుడు సాయంత్రం వారి పొలం గట్టుపై పచ్చగడ్డి కోస్తుండగా పాము కాటుకి గురయ్యాడు. దగ్గరలో ఉన్న రైతులు కుటుంబీకులకు తెలియజేయగా కొత్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తేజేశ్వరరావుకి భార్య (30), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్