స్మార్ట్ విద్యుత్ మీటర్లు, ట్రూ ఆఫ్, సర్ చార్జీలు రద్దు చేయాలని కోరుతూ సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిర్ల ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కొత్తూరు విద్యుత్ శాఖ ఏఈ నిరంజన్ కు వినతి పత్రం ఇచ్చారు. యూనిట్ విద్యుత్ ను రూ.4.60లు చొప్పున కొనుగోలు చేసేందుకు యాక్సిస్ కంపెనీతో రాష్ట్ర డిస్కామ్ లు కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు.