ఎల్.ఎన్.పేట మండలంలోని మోదుగువలస కాలనీలో డ్రైనేజీలో అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని మార్చాలని స్థానికులు కోరుతున్నారు. స్తంభం అడ్డంగా ఉండడంతో రెండు నెలలుగా డ్రైనేజ్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. డ్రైనేజీ మధ్యలో విద్యుత్ స్తంభం అడ్డంగా ఉండటంలో స్థానికులు స్తంభాన్ని తొలగించాలని కోరుతూ విద్యుత్ శాఖ అధికారులకు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు ఫిర్యాదు చేశారు.