మెలియాపుట్టి మండలంలోని రింపి గ్రామంలో బుధవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లా అధికారి సీహెచ్. తిరుపతినాయుడు ఆదేశాల మేరకు టెక్కలి ఎక్సైజ్ సీఐ మీరా సాహెబ్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించగా 900 లీటర్ల పులిసిన బెల్లం ఊటతో పాటు 10 లీటర్ల నాటుసారాను స్వాదీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు సీఐ తెలిపారు. దాడుల్లో ఎక్సైజ్ ఎస్ఐ పీ. సత్యనారాయణ, జీ. గురుమూర్తి, సిబ్బంది ఉన్నారు.