కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో ఎటువంటి లోపాలు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని టెక్కలి ఆర్డీఓ ఎం. కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం ఆయన మెళియాపుట్టిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. అనంతరం విద్యార్థులు భోజనాల నాణ్యత పరిశీలించారు. విద్యార్థుల కొరకు కళాశాలలో ఏర్పాటు చేసిన డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ పని తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.