పాతపట్నం: రైతులకు ఉపయోగపడేలా వంతెన నిర్మించాలి

64చూసినవారు
పాతపట్నం: రైతులకు ఉపయోగపడేలా వంతెన నిర్మించాలి
హిర మండలం మండలం ధనుపురం వద్ద జాతీయ రహదారి నుంచి పంట పొలాలకు వెళ్లేందుకు వంతెన నిర్మించాలని ధనుపురం, నవతల, తంప సర్పంచ్ లు కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడుని శుక్రవారం కోరారు. తంప, ధనుపురం, సారవకోట మండలం నౌతల గ్రామాలకు చెందిన రైతులవి సుమారు 500 ఎకరాల పంట భూమి పొగడవెల్లి గెడ్డ అవతలి వైపు ఉన్నాయి. NH326/A రోడ్డు వచ్చిన తరువాత రోడ్లు బాగా ఎత్తు చేయడం వలన రైతుల ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు పొలాల్లోకి వెళ్ళటానికి అవకాశం లేకుండా పోయింది. పోగడవెల్లి గెడ్డ అవతల వైపుకు వెళ్ళటానికి రైతులకు అనుకూలంగా 150 మీటర్ల పొడవు, ఎత్తు 5 అడుగులు పిల్లర్స్ తో 3 మీటర్ల వెడల్పుతో వంతెన నిర్మించాలని కోరారు.

సంబంధిత పోస్ట్