మెళియాపుట్టి మండలం కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు వంకల మాధవరావు మాట్లాడుతూ.. మెళియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన గ్రామాలన్నీ 5వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి వినోద్ పాల్గొన్నారు.