పాతపట్నం: నీలమణి దుర్గమ్మని దర్శించుకున్న కేంద్రమంత్రి

53చూసినవారు
పాతపట్నం: నీలమణి దుర్గమ్మని దర్శించుకున్న కేంద్రమంత్రి
పాతపట్నంలో కొలువైన ఉత్కలాంద్ర ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారిని కేంద్ర విమానయాన శాఖమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు దర్శించుకున్నారు. గురువారం పాతపట్నం నియోజకవర్గంలో పర్యటించిన కేంద్రమంత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి తీర్థ, ప్రసాదాలను సేకరించారు. ఆయనతో పాటు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, పైల బాబ్జి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్