కవిటి: యుద్ధ సమయంలో అండగా నిలుద్దాం

57చూసినవారు
కవిటి: యుద్ధ సమయంలో అండగా నిలుద్దాం
పాకిస్తాన్ టెర్రరిస్టులపై జరుగుతున్న యుద్ధ సమయంలో భారత్ కు అండగా నిలుద్దాం అని ప్రభుత్వ విప్, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు పిలుపునిచ్చారు. శనివారం కవిటి మండలం రామయ్యపుట్టుక లోని తన క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకులు, వివిధ వర్గాల వారితో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెహల్గాం దాడి తరువాత భారత్ నిర్ణయం సరైనదే అన్నారు. శ్రీకాకుళం జిల్లా తెలుగుమహిళా ప్రధాన కార్యదర్శి ఆశి లీలారాణి ఉన్నారు.

సంబంధిత పోస్ట్