రాష్ట్రంలో జర్నలిస్టులకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని స్థానిక జర్నలిస్టులు తిరుపతిరావు, కొత్తకోట నవీన్ ప్రభుత్వాన్ని కోరారు. ఇచ్చాపురం నియోజవర్గంలోని 4మండలాల రిపోర్టర్లు శనివారం సోంపేట పట్టణంలో ర్యాలీని నిర్వహించారు. తెలుగులో ఒక ప్రముఖ దినపత్రిక ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి ఇంటిలో అధికార పార్టీ నాయకుల సూచనల మేరకు పోలీసుల దాడిని ఖండించారు. సోంపేట సీఐ మంగరాజుకు వినతిపత్రం అందజేశారు. పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.