పశువులకు వ్యాధి నివారణటీకాలు తప్పనిసరి

59చూసినవారు
పశువులకు వ్యాధి నివారణటీకాలు తప్పనిసరి
పశువులకు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని పశు వైద్య శాఖ ఎడి మంచు కరుణాకర్ రావు అన్నారు. శనివారం పాతపట్నం మండలం కొరసవాడ గ్రామంలో పశువులకు టీకా ప్రక్రియను పరిశీలించారు. ఆరు నెలలకు పైబడిన ప్రతి పశువుకు ఈ టీకాలు వేయించాలని అన్నారు. గొంతువాపు, జబ్బ వాపు వ్యాధి సోకిన పశువుల్లో పాల దిగుబడి తగ్గుతుందని, పాతపట్నం మండల వ్యాప్తంగా 2500 టీకాలు వేయడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్