భారతీయ సంస్కృతిలో భాగమైన జ్యోతిష్యశాస్త్రాన్ని నేటి తరాలకు అందజేయాలని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్టు అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు బుధవారం అన్నారు. శ్రీకాకుళం నగరంలోని అరసవల్లిలో అవధాన సరస్వతి డాక్టర్ బులుసు అపర్ణతో ద్విశతావధాన కళా విలాసం అపర్ణ ప్రతిభా కిరణ ద్యోతకం కార్యక్రమం ప్రారంభించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ శతావధానం అంటే వంద అంశాలపై ఏకాగ్రతను నిలపటం అని అన్నారు.