రోగులకు మెరుగైన వైద్య సదుపాయలు అందించే విధంగా ఆసుపత్రి యాజమాన్యాలు అందించే దిశగా చర్య చేపట్టాలని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలోని ఉషోదయ క్లినిక్ ఆర్థోపెడిక్ & డెంటల్ కేర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. అత్యవసర వైద్యo కోసం విశాఖపట్నం పరుగులు పెట్టాల్సి వచ్చేదని, నేడు శ్రీకాకుళంలో కూడా కార్పొరేట్ స్థాయి అత్యవసర వైద్య సేవలు అందుతుండడం సుఖ పరిణామం చెప్పారు.