అరసవల్లి ఆదిత్యుని దేవస్థానం, సుమిత్ర కళాసమితి సంయుక్త నిర్వహణలో 5 రోజుల పాటు ద్విశతావధానం కార్యక్రమం నిర్వహించనున్నట్లు సుమిత్ర కళాసమితి అధ్యక్షుడు ఇప్పిలి శంకర్ శర్మ మంగళవారం తెలిపారు. వైజయంతి ఉత్సవ వేదికపై ఈనెల 10 తేదీ నుంచి 14 వరకు బులుసు అపర్ణ ద్విశతావధాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పులఖండం శ్రీనివాసరావు, బంకుపల్లి రమేష్ ఆధ్వర్యంలో ద్విశతావధానం చేపట్టడం జరుగుతుందన్నారు.