శ్రీకాకుళం నగరంలో శుక్రవారం గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతి చెందాడు. రెండవ పట్టణ సీఐ ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు పాలకొండ రోడ్డు నుంచి పుణ్యపువేదిక వెళ్లే మార్గంలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు స్థానికులు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అతని మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తెల్ల గళ్ళ చొక్కా తువ్వలతో ఉన్నారని తెలిపారు వివరాలు తెలిసినవారు తెలపాలని అన్నారు.