వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళంలోని డే అండ్ నైట్ జంక్షన్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం, టౌన్ హాల్ రోడ్డులో ఉన్న చలివేంద్రం గురువారం ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. వేసవి అధికంగా ఉండడంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప పగటి వేళల్లో బయటకు రావద్దని సూచించారు.