గార మండలం తూలుగు విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని 11 కేవీ ఫీడర్ల మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ పైడి యోగేశ్వరరావు తెలిపారు. గార, బూరవల్లి, కొర్లాం, తూలుగు, నిజామాబాద్, సతివాడ, మొగదాలపాడు గ్రామాల్లో ఆయా సమయాల్లో విద్యుత్తు ఉండదని వినియోగదారులు గమనించాలని కోరారు.