శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం తులుగు పంచాయతీలో శ్రికాకుళం నియోజకవర్గం తెలుగు మహిళ అధ్యక్షరాలు గొండు స్వాతి శంకర్ గురువారం తన భర్త తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజా గళం, బాబు సూపర్ సిక్స్ పథకాలు గురించి ఇంటింటికి ప్రచారాన్ని చేసి ప్రజలకు వివరించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం టీడీపీని గెలిపించాలని కోరారు. టిడిపి, జనసేన, బిజేపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు.